ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ను ఇమిటేట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖజానా ఖాళీ అయ్యిందని కపట నాటకాలు, దొంగ ఏడుపులు ఏడుస్తున్న సీఎం చంద్రబాబుకు హామీలు ఇచ్చే ముందు తెలియదా..? రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు, రూ.13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడిన చంద్రబాబుకు హామీలు అమలు చేయలేమని తెలియదా..? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని, అందుకే పవన్ ఫ్యాన్స్ ఆయన్ను తిట్టిపోస్తున్నారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
ఖజానా ఖాళీ అయింది అని ఏడుస్తున్నావు, అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చేముందు తెలియదా చంద్రబాబు నాయుడు?
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2025
పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు – కేఏ పాల్ pic.twitter.com/l87MoH9kSq
30 వేల మంది అమ్మాయిలు ఎక్కడ..?
‘జగన్.. నువ్వు రూ.50 మందుని రూ.150కి అమ్ముతున్నావ్.. కడుపులు కొడుతున్నావ్ అని మందు గురించి కూడా పవన్ తమ్ముడు కామెంట్స్ చేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాళ్లు దారుణంగా కల్తీ మద్యం అమ్ముతున్నారు. 30 వేల మంది మహిళలు, అమ్మాయిలు మిస్సయ్యారు, మేము రాగానే తీసుకువస్తాం’ అని మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఒక్కరినైనా తీసుకొచ్చారా? వాళ్ల గురించి ఒక్కసారైనా మాట్లాడాడా..? అని ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఇమిటేట్ చేసిన కెఏ పాల్
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2025
రూ.50 మందు రూ.150కి అమ్ముతున్నావు అని జగన్ మీద పవన్ తమ్ముడు కామెంట్ చేశాడు
ఇప్పుడు మీరు కల్తీ మందు వాళ్ల కంటే దారుణంగా అమ్ముతున్నారు – కెఏ పాల్ pic.twitter.com/OAcxsCzQSR