ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్‌.. పీఎస్‌కు త‌ర‌లింపు

ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్‌.. పీఎస్‌కు త‌ర‌లింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC), తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruthi President) కల్వ‌కుంట్ల‌ కవిత (Kalvakuntla Kavitha)ను పోలీసులు అరెస్ట్ (Arrested) చేశారు. అరెస్ట్ అనంత‌రం ఆమెను కంచన్‌బాగ్ పోలీస్ స్టేష‌న్‌కు (Kanchanbagh Police Station) త‌ర‌లించారు.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు (RTC Bus Fare Hike)ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బస్ భవన్‌ను (Bus Bhavan) తెలంగాణ జాగృతి ముట్ట‌డించింది. తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టిన కవితను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.

కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు ప్రజలపై, ముఖ్యంగా విద్యార్థులు, చిరుద్యోగులు, మహిళలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని కవిత ఆరోపించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తోంది. ఈ ధరల పెంపు వెంటనే ఉపసంహరించుకోవాలి” అని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో కవిత సహా కొందరు బస్ భవన్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

కొత్తగా పెరిగిన పాస్ ఛార్జీలు..
ప్ర‌భుత్వం అన్ని రకాల బ‌స్‌ పాస్‌ల ఛార్జీలను పెంచుతున్నట్లు పేర్కొంది. సాధార‌ణ ప్ర‌యాణికుల‌తో పాటు స్టూడెంట్‌ పాస్‌ ధరలను పెంచింది. తెలంగాణ ఆర్టీసీ 20 శాతానికి పైగా బస్‌ పాస్‌ రేట్లను పెంచింది. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్‌ ధర రూ.1,400కు పెరగగా.. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ ధర రూ.1,600కు పెరిగింది. లనే రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్‌ పాస్‌ ధర రూ.1,800కు పెరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment