జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యామిలీ దుబాయ్(Dubai)లో ప్రత్యేక వేడుకలో పాల్గొని సందడి చేస్తోంది. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi), అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రముఖ వ్యాపారవేత్త, ఏఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ మహేష్ రెడ్డి కుమారుడి వివాహం దుబాయ్లో జరగనుంది. ఈ పెళ్లి కోసమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులంతా దుబాయ్కు చేరుకుంటున్నారు.
మహేష్రెడ్డి కుమారుడి వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో సహా దుబాయ్కి చేరుకున్నారు. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఈ వేడుకకు హాజరైనట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ ఫంక్షన్గా జరిగిన ఈ వేడుకలో స్టార్ ఫ్యామిలీల ఉత్సాహం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, ఫాలోవర్లు ఈ స్టార్స్ స్టైలిష్ లుక్స్, ఫ్యామిలీ బాండింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.