దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. జెజు ఎయిర్ విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగా రన్వేపై జారుతూ ఎయిర్పోర్ట్ రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది. ఈ ఘటనలో 174 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంపై జెజు ఎయిర్ సీఈఓ కిమ్ ఇబే స్పందించారు. ప్రమాదం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేస్తూ..”ఈ విషాదకర సంఘటనకు కారణంతో సంబంధం లేకుండా నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను” అని తెలిపారు.

థాయ్లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన విమానం సియోల్కు 290 కిలోమీటర్ల దూరంలో ముయాన్కు చేరుకుంటుండగా, విమానంలో ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. ఏటీసీ నుంచి ‘బర్డ్స్ట్రైక్’ వార్నింగ్ వచ్చినప్పటికీ, పరిస్థితి అదుపు తప్పింది. విమానంతో ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగా రన్వేపై జారుతూ వెళ్లిన విమానం రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు.
విచారణ కొనసాగుతోంది
ఈ ఘోర ప్రమాదానికి కారణంగా ల్యాండింగ్ గేర్ వైఫల్యం మరియు విమానాన్ని వెంటాడిన ఇబ్బందులని ప్రాథమిక కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇంకా ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు విచారణ కొనసాగుతుంది.