బుమ్రా – సంజనా మైదానంలో హాట్ చర్చ, నెట్టింట వైరల్

బుమ్రా – సంజనా మైదానంలో హాట్ చర్చ, నెట్టింట వైరల్

భారత స్టార్ బుమ్రా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చకు తెరపైకి వచ్చింది. ఆ చర్చకు కారణం అతని సతీమణి సంజనా గణేశన్. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా, సంజనా మైదానంలో ముచ్చటించడమే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా బీసీసీఐకి టోర్నమెంట్ సమయంలో ఆటగాళ్లకు కుటుంబ సభ్యులతో మైదానంలో కలసే అవకాశం కొంచెం కష్టం.

కానీ, సంజనా స్పోర్ట్స్ ప్రెజెంటర్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికెట్ ఈవెంట్లకు మీడియా భాగంగా ప్రయాణిస్తారు. అందువల్ల బుమ్రా ఎప్పుడైనా తన భార్యను కలుసుకోవచ్చు. ఈ క్రమంలో నమీబియా మ్యాచ్ సందర్భంగా మైదానంలో విడిపించుకున్న క్షణాలు వీడియోగా నెట్టింట వైరల్ అయ్యాయి. ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తూ ‘బుమ్రా భలే లక్కీ’, ‘ఇతర ఆటగాళ్లకు లేని సౌలభ్యం’ అంటూ ట్వీట్ చేస్తున్నారు.

మైదానంలో బుమ్రా క్రీడా ప్రదర్శన కూడా అదిరింది. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అంతేకాదు అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్లోని మూడో బంతిని నమీబియా బ్యాటర్ మలన్ క్రుగర్ భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ, బుమ్రా పరుగులు తీసి సూపర్ క్యాచ్ తీసాడు. ఈ క్రమంలో వచ్చిన సూపర్ ఫీల్డింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment