మ‌రో జనసేన నేత ‘రాసలీలల’ భాగోతం.. ఈవిడకైనా న్యాయం దక్కేనా..? (Video)

మ‌రో జనసేన నేత ‘రాసలీలల’ భాగోతం.. ఈవిడకైనా న్యాయం దక్కేనా..? (Video)

రాష్ట్రంలో ఒక్కొక్క‌టిగా బయటపడుతున్న జ‌న‌సేన‌ నేతల రాస‌లీల‌ల వ్య‌వ‌హారాలు ఆ పార్టీని పీక‌ల్లోతు ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయి. అధికార బ‌లంతో మ‌హిళ‌ల‌పై వారు చేస్తున్న ఆగ‌డాలు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ అంశం మ‌రువ‌క ముందే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ జనసేన ప్ర‌జాప్ర‌తినిధి రాస‌లీల‌ల‌కు సంబంధించి బాధిత మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. సామాన్య మహిళలనే కాదు.. జ‌న‌సేన వీర మ‌హిళ‌ల‌ను కూడా ఆ పార్టీ నేతలు వదలడం లేదంటూ ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఏమిటా వివాదం?
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ZPTC జయప్రకాష్ నాయుడు తనను అన్ని విధాలా వాడుకుని మోసం చేశాడంటూ భీమవరానికి చెందిన మద్దాల విజయలక్ష్మి అనే మహిళ కన్నీరు పెట్టుకుంది. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానిని అని, జనసేన పార్టీ మద్దతుదారుని అని చెబుతున్న ఆమె.. జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా హింసించాడని ఆరోపించింది.

సంచలన ఆరోపణలు
జయప్రకాష్ నాయుడు తన వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల నగదు, బంగారాన్ని తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని బాధితురాలు పేర్కొంది. తనను శారీరకంగా వాడుకోవడమే కాకుండా, తనపై దాడి కూడా చేశాడని ఆమె వెల్లడించింది. ఆమెపై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేసింది. తనను మోసం చేయడమే కాకుండా, అతని అవసరాల కోసం ఇతర అమ్మాయిలను కూడా ట్రాప్ చేయాలని తనపై ఒత్తిడి తెస్తున్నాడని ఆమె ఆరోపించడం విస్మయానికి గురి చేస్తోంది.

న్యాయం కోసం బాధితురాలి పోరాటం
ప్రస్తుతం జ‌న‌సేన నాయ‌కుడు జ‌య‌ప్ర‌కాష్‌ నాయుడు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ప్రాణహాని కూడా ఉందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఆడియోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ పలుకుబడితో తనను నలిపేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటోంది. వరుసగా బయటపడుతున్న ఇలాంటి ఘటనలు పార్టీల ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. మరి ఈ వ్యవహారంపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment