తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మాటల యుద్ధం వేడెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి (CM-Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎంపీ (BJP MP) ఈటల రాజేందర్ (Etela Rajender) ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా హెచ్చరించారు. “ఇంకొసారి సీఎంపై అర్థంలేని విమర్శలు చేస్తే… నడిరోడ్డులో నిలబెట్టి గుంజీలు తీయిస్తా” అంటూ జగ్గారెడ్డి ఫైరయ్యారు.
ఈటల రాజేందర్ పరిమితి దాటి మాట్లాడడమే కాకుండా, రాజకీయ భాషను దిగజార్చాడని జగ్గారెడ్డి ఆరోపించారు. “అతను మాటలు జాగ్రత్తగా వాడాలి. లేదంటే, నాకు కూడా సమాధానం ఎలా ఇవ్వాలో తెలుసు” అని స్పష్టం చేశారు. ఈటల ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని, ఇది వ్యక్తిగత గొడవ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉన్నవారు ఆచరణలో మార్పు చూపించాలని సూచించారు.
శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి తలా తోక లేదని, రేవంత్ ఓ శాడిస్ట్, సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని.. ఖబడ్దార్ అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.