ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం 2 ఉపగ్రహాలను భూమి కక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా జరగాల్సింది. కానీ, ఉపగ్రహాల కదలికలు ఊహించిన దానికంటే నెమ్మదిగా ఉండటంతో డాకింగ్ ప్రదేశానికి చేరడానికి అవి మరింత సమయం తీసుకుంటున్నాయని ఇస్రో తెలిపింది.
ఉపగ్రహాల సురక్షితతపై స్పష్టత
ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం, ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయనీ, వాటి మధ్య దూరం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈనెల 7న జరగాల్సిన ఈ ప్రాధాన్యత గల ప్రయోగం వాయిదా పడటంతో కొత్త తేదీపై ఆతృత పెరిగింది. తాజా పరిస్థితులను విశ్లేషించిన తరువాత తదుపరి తేదీని ప్రకటిస్తామని ఇస్రో స్పష్టం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భారత్ స్పేస్ డాకింగ్ సాంకేతికతలో ముందడుగు వేయనుంది.