ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థగా గుర్తించబడిన Islamic State (ISIS), తాజాగా 1,000 టన్నుల యురేనియం సాధించడమే లక్ష్యంగా కదలికలు ప్రారంభించింది. ఈ యురేనియం వారి చేతికి వస్తే, ఐసిస్ అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలను సృష్టించగలదని రక్షణ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 టన్నుల యురేనియం ఉన్నట్లు అంచనా, దీని 10 శాతం అంటే 1,000 టన్నులు. ఐసిస్ దీన్ని స్వాధీనం చేసుకుంటే, గ్లోబల్ సెక్యూరిటీ కి పెద్ద ముప్పు తెచ్చే అవకాశం ఉంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా సంస్థ నివేదికల ప్రకారం, ఐసిస్ ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, మరియు ఆఫ్రికన్ దేశాల్లో చురుకుగా ఉంది. ఈ ఉగ్రవాద సంస్థ ప్రధానంగా “ఇస్లామిక్ ఛాందసవాదాన్ని” తిరిగి స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. నివేదికల ప్రకారం, నైజర్లో 1,000 టన్నుల యురేనియం భద్రతా ప్రయోజనాల కోసం నిల్వ చేయబడింది. గతంలో ఫ్రెంచ్ కంపెనీ దీనిపై కాపు వహించేది, కానీ ఇప్పుడు ఆ ఒప్పందం రద్దు కావడంతో నైజీరియన్ సైన్యం దీనిని పర్యవేక్షిస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులు ఇప్పటికే ఈ యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి దాడి చేసినప్పటికీ, ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు.
ఇప్పటికే, నైజర్ యురేనియం విక్రయానికి చైనా, రష్యా వంటి దేశాలతో చర్చలు జరుపుతున్నాయి, కానీ ఇప్పటివరకు ఎటువంటి ఫైనల్ ఒప్పందం సాధించబడలేదు. గతంలో ఐసిస్ ఆ యురేనియం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, అల్-నాబా వారపత్రిక ద్వారా ప్రకటించిన ప్రకటనలో భవిష్యత్తులో దీన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. రక్షణ వర్గాలు, అంతర్జాతీయ సమాజం ఈ ఘటనను అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి, ఎందుకంటే 1,000 టన్నుల యురేనియం ఐసిస్ చేతికి వస్తే ప్రపంచ సెక్యూరిటీ కోసం పెద్ద ముప్పుగా మారవచ్చు.








