గల్ఫ్ ప్రాంతంలో (Gulf Region) సముద్ర రవాణా (Maritime Transport), వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధిపై (Strait of Hormuz) ఇరాన్(Iran) తాజాగా కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ ఓడరేవులు (Gulf Ports) ఏ ఒక్క దేశానికే కాకుండా అందరికీ చెందుతాయని, అవి అంతర్జాతీయ వాణిజ్యానికి మూలాధారమని ఇరాన్ స్పష్టం చేసింది. “అందరికీ చెందకుంటే ఎవరికీ ఉండవు” అనే కఠిన హెచ్చరికతో, సముద్ర మార్గాలపై ఏకపక్ష నియంత్రణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించింది. అంతర్జాతీయ జలాల్లో (International Waters) నౌకల రాకపోకలను నియంత్రించేందుకు శాశ్వత యంత్రాంగం అవసరమని, అది అన్ని దేశాల సహకారంతోనే సాధ్యమని ఇరాన్ పేర్కొంది.
ఇక అమెరికా (United States) విధిస్తున్న ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తూ, అవి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. అమెరికా వైఖరి సముద్రపు దొంగల తరహాలో ఉందని విమర్శిస్తూ, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచే చర్యలను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అమెరికా వైఖరి సముద్రపు దొంగల తరహాలో ఉందన్నఇరాన్.
ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు, సముద్ర వాణిజ్యం భవిష్యత్తుపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు మరింత వేగం అందుకునే అవకాశం కనిపిస్తోంది.








