ఇంకొన్నిరోజుల్లో IPL 2025 సీజన్ ప్రారంభం కానుండటంతో సమరానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ, పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు మాత్రం భిన్నంగా ముందుకు వెళ్లింది. ఈసారి ట్రోఫీ తామే గెలుచుకోవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించింది.
ఈ పూజలో టీమ్ కోచ్ రికీ పాంటింగ్, కోచింగ్ సిబ్బంది, అలాగే పలువురు ఆటగాళ్లు పాల్గొన్నారు. 2008 నుంచి IPLలో ఆడుతున్నా ఇప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్లోకి అడుగుపెడుతున్న పంజాబ్ కింగ్స్కు ఈసారి అదృష్టం కలిసి వస్తుందా? కప్ కల సాకారమవుతుందా? అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.