ప్రముఖ రేడియో జాకీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గురుగ్రామ్లోని సెక్టార్ 47లో తన ఫ్లాట్లో మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు సిమ్రాన్ సింగ్ మృతిని ఆత్మహత్యగా భావిస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం అనంతరం సిమ్రాన్ మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. ఆమె మరణం వెనుక అసలు కారణాల గురించి స్పష్టత రావాల్సి ఉంది.
తీవ్ర విషాదంలో ఫ్యాన్స్
సిమ్రాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె క్రియేటివ్ కంటెంట్, వినోదాత్మక వీడియోలతో యువతను ఆకట్టుకుంది. ఆమె అకస్మాత్తుగా మరణించడం అందరినీ ఆవేదనకు గురి చేసింది. సోషల్ మీడియాలో అభిమానులు సిమ్రాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేస్తున్నారు.