‘బ్రిక్స్’లో చేరిన ఇండోనేషియా..

'బ్రిక్స్'లో చేరిన ఇండోనేషియా..


బ్రెజిల్ (Brazil), రష్యా (Russia), ఇండియా (India), చైనా (China), దక్షిణాఫ్రికా (South Africa) అనే ఐదు జాతీయ ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్య కూటమి బ్రిక్స్ (BRICS) ఇప్పుడు తన భాగస్వామ్యంలో మరో దేశాన్ని చేర్చుకుంది. తాజాగా ఇండోనేషియా (Indonesia)ను కొత్త సభ్యునిగా ‘బ్రిక్స్’ (BRICS) స్వాగతించింది. కాలానుగుణంగా బ్రిక్స్ ఎలా విస్తరించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

2010లో న్యూయార్క్‌ (New York)లో జరిగిన ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను తమ కూటమిలో చేర్చుకునేందుకు అంగీకరించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 2011లో సన్యాలో జరిగిన మూడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికా హాజరైంది.

తాజాగా జరిగిన బ్రిక్స్ దేశాధినేతల సమావేశంలో ఇండోనేషియాను గ్రూప్‌లో సభ్యునిగా స్వాగతించడంతో, ఇప్పుడు బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, నైజీరియా, మలేషియా, థాయిలాండ్, క్యూబా, వియత్నాం, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ సహా 10 దేశాలు బ్రిక్స్‌లో భాగస్వామ్య దేశాలుగా అవతరించాయి.

విస్తరణపై ప్రధాని మోదీ హర్షం
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ ఉమ్మడి ప్రకటనలో, “బ్రిక్స్ సభ్యదేశంగా ఇండోనేషియా రిపబ్లిక్‌ను, బెలారస్ రిపబ్లిక్, బొలీవియా ప్లూరినేషనల్ స్టేట్, కజకిస్తాన్ రిపబ్లిక్, క్యూబా రిపబ్లిక్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా, మలేషియా, థాయిలాండ్, సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం, ఉగాండా రిపబ్లిక్, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్‌లను బ్రిక్స్ భాగస్వామ్య దేశాలుగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.” ఆదివారం జరిగిన బ్రిక్స్ సమావేశంలో బ్రిక్స్ విస్తరణలో భాగంగా కొత్త భాగస్వాములను చేర్చుకోవడం అనేది కూటమి దేశాల సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment