బంగ్లా చెర నుంచి స్వ‌దేశానికి 95 మంది మత్స్యకారులు

బంగ్లా చెర నుంచి స్వ‌దేశానికి 95 మంది మత్స్యకారులు

భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య సంబంధాల కాస్త ఇబ్బందిక‌రంగా మారుతున్న క్ర‌మంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పడిన తర్వాత, రెండు దేశాలు తమ మత్స్యకారుల మార్పిడి ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో భాగంగా అరెస్ట్ అయిన 95 మంది భారతీయ మత్స్యకారులను బంగ్లాదేశ్ విడిచిపెట్టింది.

ఇండియన్ కోస్ట్ గార్డ్, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ మధ్య సమన్వయంతో, ఈ 95 మంది భారతీయ మత్స్యకారులు నాలుగు ఫిషింగ్ బోట్లతో సహా స్వదేశానికి చేరుకున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా, 90 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను కూడా భార‌త్ రిలీజ్ చేసింది. ఒక ముఖ్యమైన ఘటనలో, భారత నౌక ‘కౌశిక్’ 12 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను రక్షించింది, మునిగిపోయిన ఓ ఫిషింగ్ బోట్ నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారు.

ఐసీజీ షిప్స్ ‘వరద్’ మరియు ‘అమృత్ కౌర్’ ద్వారా భార‌త‌ మత్స్యకారుల స్వదేశానికి చేరుకున్నారు. ఈ విష‌యాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారతదేశం మత్స్యకారుల భద్రత, రక్షణ, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ఈ మార్పిడి చర్యను కొనసాగిస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment