ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు క్రికెట్ అభిమానులను ఉత్కంఠలో ముంచిలేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలో కీలకమైన ఈ పోరాటంలో పాకిస్థాన్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే కివీస్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్, ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది.
భారత్ గెలిస్తే పరిస్థితి ఏమిటి?
భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే, సెమీఫైనల్ రేసులో ముందంజ వేస్తుంది. ఇక మార్చి 2న న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ మరింత కీలకమవుతుంది. టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీస్కు అర్హత పొందుతాయి. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ గ్రూప్-Aలో అగ్రస్థానంలో ఉన్నాయి.
ఈ హై-వోల్టేజ్ పోరుకు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ విజయాన్ని సాధిస్తుందా? లేక పాకిస్థాన్ అద్భుత ప్రదర్శనతో తిరిగి వస్తుందా? వేచి చూడాల్సిందే.