---Advertisement---

రోహిత్ విధ్వంసం – ఇంగ్లండ్‌పై టీమిండియా గెలుపు!

రోహిత్ విధ్వంసం – ఇంగ్లండ్‌పై టీమిండియా గెలుపు!
---Advertisement---

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా, శుభ్‌మన్ గిల్ అర్ధ‌ శతకంతో మెరిశాడు. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచి, మరొక‌ మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఇంగ్లండ్ భారీ స్కోరు
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (69), బెన్ డక్కెట్ (65) అర్ధ శతకాలు సాధించగా, లియామ్ లివింగ్‌స్టోన్ (41), జోస్ బట్లర్ (34) మద్దతునిచ్చారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/35) మెరుగైన బౌలింగ్ ప్రదర్శించగా, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తికి తలో వికెట్ దక్కింది.

హిట్‌మ్యాన్ ధాటికి ఇంగ్లండ్ తలొంచింది
భారత్ ఛేదనకు దిగినప్పుడు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆద్యంతం మెరిపించారు. 90 బంతుల్లో 119 పరుగులు చేసిన రోహిత్, 12 ఫోర్లు, 7 సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. శుభ్‌మన్ గిల్ (60) అర్ధ శతకంతో రోహిత్‌కు చక్కటి సహకారం అందించాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయతీరానికి చేర్చారు.

ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ (2/27) రెండు వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు. అయితే భారీ లక్ష్యాన్ని తేలికగా ఛేదించిన టీమిండియా, ఈ విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment