బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు సిరీస్లు గెలుచుకున్న టీమిండియా, ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ధీమా వ్యక్తం చేస్తూ, “మేము మెల్బోర్న్లో జరిగే బాక్సింగ్ డే టెస్ట్లో అత్యుత్తమ ప్రదర్శన చూపిస్తాం, మొత్తం సిరీస్ను గెలుచుకుని, హ్యాట్రిక్ సాధిస్తాం” అని పేర్కొన్నాడు.
డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో ప్రారంభమయ్యే నాలుగో టెస్టుపై జట్టంతా దృష్టి పెట్టిందని, ఈ కీలక మ్యాచ్కి తగిన విధంగా సన్నద్ధమవుతున్నామని జడేజా తెలియజేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై మూడోసారి ట్రోఫీ కైవసం చేసుకోవడం టీమ్ ఇండియాకి గర్వకారణమని జడేజా అభిప్రాయపడ్డాడు.