ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి

ఉపరాష్ట్రపతి (Vice President) అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెర దించుతూ, ఇండియా కూటమి (India Alliance) తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (B. Sudarshan Reddy) (79) పేరును ఖరారు చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రస్థానం
స్వస్థలం: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, ఆకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.

విద్యాభ్యాసం: ఉస్మానియా యూనివర్సిటీలో 1971లో న్యాయశాస్త్రం అభ్యసించారు.

న్యాయ జీవితం:

1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, నాలుగున్నరేళ్లు ఆ పదవిలో సేవలందించారు.

ముఖ్యమైన తీర్పులు:

నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని విమర్శిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సాల్వా జుడుమ్ (మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజన యువకులను నియమించడం) చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చారు.

పదవీ విరమణ తర్వాత:

2011 జూలై 8న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు.

రిటైర్ అయ్యాక గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్‌గా పనిచేశారు.

2024 డిసెంబర్‌లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ & మీడియేషన్ సెంటర్ (IAMC) శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు.

ఎన్డీఏ కూటమి తరఫున రాధాకృష్ణన్ పేరు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో, ఇండియా కూటమి అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుతో తెరపడింది. ఈ రేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరు రాజకీయ నేతలతో పాటు గాంధీ మనవడు తుషార్ గాంధీ పేర్లు కూడా వినిపించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment