క్వీన్స్లాండ్ (Queensland)లో ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా (Team India) 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 168 రన్స నిర్దేశమైంది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (28), శుభ్మన్ గిల్ (46) ధాటిగా ఆడి 56 పరుగుల భాగస్వామ్యంతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా గిల్ (39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత శివమ్ దూబే (22), సూర్యకుమార్ యాదవ్ (20) కీలక పరుగులు అందించారు.
అయితే, మిడిల్ ఓవర్లలో ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో భారత్ వరుసగా వికెట్లను కోల్పోయింది. తిలక్ వర్మ (5), జితేశ్ శర్మ (3) నిరాశపరిచారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (12)తో పాటు అక్షర్ పటేల్ (21) వేగంగా పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలిస్ మరియు ఆడమ్ జంపా తలో మూడు వికెట్స్ పడగొట్టి భారత్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.








