ఓటర్ల జాబితా (Voters List) విశ్వసనీయతను పెంపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాను ఇకపై జనన (Birth), మరణ (Death) ధ్రువీకరణ (Verification) రికార్డులతో (Records) అనుసంధానం (Link) చేయనుంది. భారత ప్రభుత్వం వద్ద ఉన్న జనరల్ రిజిస్ట్రార్ నుంచి ఎలక్ట్రానిక్గా మరణ డేటా ఎప్పటికప్పుడు సేకరించి, ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తామని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. దీనివల్ల, మరణించిన ఓటర్లు జాబితాలో కొనసాగకుండా ఉండేలా చూసేందుకు అవకాశం లభించనుంది.
బీఎల్ఓలకు అవకాశం..
ఇకపై బూత్ స్థాయి అధికారులకు (BLOs) మరణ సమాచారం ధృవీకరించేందుకు కచ్చితమైన అధికారం లభించనుంది. ఓటరు బంధువుల నుంచి దరఖాస్తు వచ్చేంతవరకూ వేచి ఉండకుండా, వారు స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమాచారాన్ని సమీకరించవచ్చు. ఇది 1960 ఓటర్ల నమోదు నిబంధనలు మరియు 1969 జనన మరణాల నమోదు చట్టం (RBD Act 1969) ప్రకారం సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.
ఓటరు స్లిప్కి కొత్త డిజైన్
ఓటర్లకు పంపే ఓటరు సమాచార స్లిప్ రూపకల్పనను కూడా మరింత ఆకర్షణీయంగా, స్పష్టంగా మారుస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ సీరియల్ నెంబర్ మరియు పార్ట్ నెంబర్ తదితర వివరాలను పెద్ద ఫాంట్లో ముద్రించడం ద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ను సులభంగా గుర్తించగలుగుతారని, అలాగే ఎన్నికల సిబ్బంది కూడా ఓటర్లను తక్కువ సమయంలో గుర్తించగలుగుతారని వివరించారు.