అంధ‌కారంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. పరీక్షలపై ప్రభావం?

అంధ‌కారంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. పరీక్షలపై ప్రభావం?

ఇడుపులపాయ (Idupulapaya) ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థులు (Students) తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా PUC-1 విద్యార్థులు పరీక్షల (Exams) సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఈదురుగాలులతో విద్యుత్ (Electricity) సరఫరా (Supply)కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న విద్యార్థులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

విద్యార్థుల వివ‌రాల ప్ర‌కారం.. ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీ కాలేజీ అధికారులు జనరేటర్లను (Generators) ఏర్పాటు చేయకపోవడం వల్ల పరీక్షలకు సన్నద్ధం కావడంలో తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంటున్నామ‌ని వాపోతున్నారు. తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో SEM-1లో తమ మార్కులు తగ్గాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా విద్యార్థులలో అసంతృప్తి నెలకొంది. అధికారుల నుండి తక్షణ చర్యలపై వారు ఆశలు పెట్టుకున్నారు.

విద్యుత్ సమస్యలు (Electricity Issues) తక్షణమే పరిష్కరించకపోతే విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌క్ష‌ణ‌మే విద్యార్థుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని, కాలేజీ హాస్ట‌ల్‌లో జ‌న‌రేట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని, అంత‌రాయం లేకుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment