ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు తమ ప్రదర్శనతో మెరిసారు. బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో నిలిచి తన స్థాయిని కొనసాగిస్తుండగా, రిషభ్ పంత్ మూడు స్థానాలు మెరగుపర్చుకొని 9వ ర్యాంక్లోకి ఎగబాకాడు.
బ్యాటింగ్ & బౌలింగ్ ర్యాంకింగ్స్లో..
మొదటి స్థానంలో జో రూట్ (ఇంగ్లాండ్), రెండో ర్యాంక్లో హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్), మూడో స్థానంలో కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో, రిషభ్ పంత్ 9వ స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రిత్ బూమ్రా మొదటి స్థానాన్ని ఆక్రమించగా, రవీంద్ర జడేజా 9వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. కాగా, రిషభ్ పంత్ టాప్-10లోకి రావడం అభిమానులకు ఉత్సాహాన్ని నింపింది.