రాయదుర్గంలో ఎకరం రూ.150 కోట్లు.. భూ వేలానికి సర్కార్ రెడీ!

రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ.. ఎకరం ₹150 కోట్లు!

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి జోష్ పెరగనుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ప్రభుత్వం నిర్వహించబోయే భూముల వేలం దీనికి ప్రధాన కారణం. వచ్చే నెలలో జరిగే ఈ-వేలంలో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఒక ఎకరానికి రిజర్వ్ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించింది. అయితే, వేలంలో ఈ ధర కనీసం రూ.150 కోట్లకు చేరుతుందని, ఇంకా ఎక్కువే పలికే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో గల ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు, ప్లాట్ నంబర్ 15A/2లో 7.67 ఎకరాలు కలిపి మొత్తం 18.67 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ వేలంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,180గా, బిడ్ డాక్యుమెంట్ ఫీజు ఒక్కో ప్లాట్‌కు రూ.10 లక్షలుగా (అదనపు GSTతో కలిపి) నిర్ణయించారు. బిడ్ దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు, భూమిని సందర్శించడానికి అక్టోబర్ 4 వరకు గడువు ఉంది.

వేలం అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అంచనా. ప్రభుత్వ ఆర్థిక కష్టాలను తగ్గించుకోవడానికి ఈ వేలం ఒక ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment