కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెంట్ర కళగం (Tamilga Vetri Kazhagam) పార్టీ అధినేత దళపతి విజయ్ భద్రతపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్కి వై+ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హీరో విజయ్కి ఉన్న ముప్పును అంచనా వేసిన నిఘా సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు తెలిపింది. వై+ భద్రత అనేది నాలుగో స్థాయి అత్యున్నత భద్రతా కేటగిరీ. ఇందులో మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్ట్ వారీగా భద్రత కల్పిస్తారు. వీరిలో ఇద్దరు నుంచి నలుగురు కమాండోలు, మిగిలిన వారు పోలీసు సిబ్బంది ఉంటారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ బరిలోకి దిగుతుందని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడులోని పరిస్థితులపై ఆయన బహిరంగ సమావేశాల్లో ప్రసంగిస్తున్నారు. ప్రజల మధ్య పర్యటిస్తున్నారు. ఇటీవల విజయ్ తన పార్టీ నేతలతో కలిసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో చర్చలు జరిపారు. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.