తుపాను ప్ర‌భావం.. శ్రీ‌వారి భక్తులకు త‌ప్ప‌ని ఇబ్బందులు

తుపాను ప్ర‌భావం.. శ్రీ‌వారి భక్తులకు త‌ప్ప‌ని ఇబ్బందులు

తిరుపతి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో గత రాత్రి నుంచి తిరుపతి నగరం, తిరుమల ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. వ‌ర్షాల ధాటికి తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు..
వర్షాల తీవ్రత పెరుగుతుండటంతో తిరుమల ఘాట్ రోడ్లపై కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పాపవినాశనం, శ్రీ‌వారి పాదాల‌కు వెళ్లే మార్గాలు మూసివేసి, భక్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

తిరుపతి జిల్లాలో ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అలాగే, గోగర్భం, పాపవినాశనం జలాశయాలు వర్షపు నీటితో నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
తిరుపతి, నెల్లూరు జిల్లాల ప్రజలు వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులతో సతమతమవుతున్నారు. వరుస తుపానుల వల్ల జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment