ఆనందంగా జరగాల్సిన కాలేజీ ఫెస్ట్ (College Fest) విషాదాంతమైంది. మహారాష్ట్ర (Maharashtra) లోని పరాండ తాలూకాలోని మహర్షి గురువర్య ఆర్జీ షిండే మహావిద్యాలయం (Maharshi Guruvarya RG Shinde College) లో స్పీచ్ ఇస్తున్న సమయంలో 20 ఏళ్ల విద్యార్థిని వర్ష ఖరత్ (Varsha Kharat) అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ప్రసంగం మధ్యలో ఆమె నవ్వుతూ కనిపించినప్పటికీ, ఆ నవ్వు క్షణాల వ్యవధిలోనే విషాదంగా మారింది.
వర్ష ఖరత్ ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే హఠాత్తుగా నేలపై పడిపోవడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ గుండెపోటు (Heart Attack) తో అప్పటికే మృతి (Dead) చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో ఆమె మరాఠీ (Marathi) లో మాట్లాడుతున్నప్పుడు ప్రేక్షకులు నవ్వుతుండగా, ఆమె స్పీచ్లో ఉండగానే నెమ్మదిగా కింద పడిపోతూ కనిపిస్తుంది. ఈ సంఘటన ఒక్కసారిగా అందరినీ విషాదంలో ముంచేసింది.
క్షణాల్లోనే నవ్వు మాయం
— Telugu Feed (@Telugufeedsite) April 6, 2025
గుండెపోటుతో స్టేజీపై కుప్పకూలిన యువతి
మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలో ఒక కళాశాల కార్యక్రమంలో 20 ఏళ్ల వర్ష ఖరత్ మృతి#HeartAttack pic.twitter.com/q47F0376Yj