ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 21న దాఖలైన ఈ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. తొలుత ఈ కేసు విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం కేటీఆర్ను 30వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని, అయితే విచారణ కొనసాగించవచ్చని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఏసీబీ, దానకిషోర్కు నోటీసులు
ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్కు నోటీసులు జారీ చేసింది. తమది రెగ్యులర్ బెంచ్ కానందున, తదుపరి విచారణ రెగ్యులర్ రోస్టర్తో కూడిన బెంచ్ ముందు జాబితా చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుదారుగా ఉన్న దానకిషోర్ ఇప్పటికే తన వాంగ్మూలాన్ని ఏసీబీ ముందు ఉంచారు. ఇప్పటి వరకు జరిగిన విచారణపై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. దాన కిషోర్ కూడా ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయనున్నారు.
నోటీసుల ప్రక్రియ పెండింగ్లో
ఈ కేసులో విచారణ దశలో ఉన్నందున ఏ1 కేటీఆర్, ఏ2 అరవింద్ కుమార్, ఏ3 బీఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ నోటీసులు జారీ చేయలేదు. కానీ నోటీసులు పంపేందుకు అవసరమైన సమాచారాన్ని అధికారులు సిద్ధం చేశారు. రెగ్యులర్ బెంచ్ విచారణకు జాబితా చేసిన ఈ కేసు త్వరలోనే కీలక మలుపులు తియ్యే అవకాశం ఉంది. కేసు పరిణామాలు ఎలా ఉంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.