ఇదేనా ప్రజాస్వామ్యం? – అక్ర‌మ కేసులపై హరీశ్‌రావు సీరియ‌స్

ఇదేనా ప్రజాస్వామ్యం? – అక్ర‌మ కేసులపై హరీశ్‌రావు సీరియ‌స్

తెలంగాణ (Telangana)లో కక్ష సాధింపు రాజకీయాలు చెలరేగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన విద్యార్థులు (Students), బీఆర్ఎస్ (BRS) నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా (illegally) కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు.

నల్లగొండ జిల్లా మర్తినేని గూడెం (Marthineni Gudem) లో మాజీ సర్పంచ్ బండమీది రాము (Bandameedi Ramu) ను అక్రమంగా పోలీసులు స్టేషన్‌లో నిర్బంధించారని ఆరోపించారు. ‘‘ఇలా ఒక్కొక్కరిపై కేసులు పెడుతూ వెళ్లి, చివరికి ప్రజల నోరు మూయాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు (Mr. Revanth Reddy)?’’ అని ప్రశ్నించారు హరీశ్ రావు.

‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులా? ఇది ప్రజాస్వామ్యమా (Democracy) లేక ఇంకొకటా?’’ అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఈ అక్రమాలకు భయపడదని, కాంగ్రెస్ హామీలను అమలు చేయించేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment