రేవంత్ ప‌నిచేసేది రాష్ట్రం కోస‌మా..? చంద్రబాబు కోసమా?

రేవంత్ ప‌నిచేసేది రాష్ట్రం కోస‌మా..? చంద్రబాబు కోసమా?

కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు (Project)పై నియమించిన విచారణ కమిషన్‌ (Inquiry Commission’s)కు సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు (Harish Rao), ప్రాజెక్టు పనులు పూర్తిగా క్యాబినెట్ (Cabinet) ఆమోదం (Approval) తోనే జరిగాయని స్పష్టం చేశారు. మెడిగడ్డ పనులకు క్యాబినెట్ ఆరు సార్లు ఆమోదం తెలిపిందని, అలాగే శాసనసభలో కూడా మూడుసార్లు ఆమోదం పొందిందని గుర్తుచేశారు. ఈ విషయాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను కమిషన్‌కు అందజేశామని, అయితే కమిషన్‌కు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లను తమకు కాపీ ఇవ్వాలని సెక్రటరీని అడిగినా ఇవ్వలేదని ఆయన తెలిపారు. అంతేకాదు, తాను సీఎస్, జీఏడీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీలకు లేఖ రాసినా ముగ్గురి నుంచి సరైన సమాధానం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కమిషన్‌కు నిజమైన వివరాలు ఇస్తున్నారా లేదా అనే అనుమానం వస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు.

కృష్ణా జలాల వివాదంపై హరీశ్ రావు ఆగ్ర‌హం
తెలంగాణకు నీటి పంచాయితీలో జరిగిన అన్యాయంపై కూడా హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కృష్ణా బేసిన్‌లోని 299 టీఎంసీల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అయిన కేవలం 42 రోజుల్లోనే కేసీఆర్ కేంద్రాన్ని నీటి పంపిణీ కోసం అడిగారని, కానీ ఇప్పుడు సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆ నిజాన్ని దాచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

నీటి పంపకం ట్రిబ్యునల్ పరిధిలో ఉందని సీఎం రేవంత్ స్వయంగా బహిరంగంగా అంగీకరించారని, బోర్డు తాత్కాలికంగా వాటాలను వెల్లడిస్తుందని ఆయన ఒప్పుకున్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు అదే విషయాన్ని తాము చెప్పగానే దానిని తప్పుగా భావిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డికి బేసిన్‌ల గురించి కనీస అవగాహన లేదు అంటూ హరీశ్ తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రం కోస‌మా..? చంద్రబాబు కోసమా?
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా? లేక చంద్రబాబు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా? అన్నదే ప్రశ్న అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. “బేసిక్ లు తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. నీటి విషయాల్లో కనీస అవగాహన లేని ఆయన నీటి మంత్రిని చేశారు. ఇది రాష్ట్రానికి గొడ్డలి పెట్టు అవుతుంది” అని హరీశ్ రావు తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment