మాకు రాజ‌కీయాల‌కంటే రాష్ట్ర‌మే ముఖ్యం.. కాంగ్రెస్‌పై హరీష్ ఫైర్‌

మాకు రాజ‌కీయాల‌కంటే రాష్ట్ర‌మే ముఖ్యం.. కాంగ్రెస్‌పై హరీష్ ఫైర్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అధికార పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleshwaram Project)పై రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)లో 85 పిల్లర్లలో రెండు కుంగినంత మాత్రాన ప్రాజెక్ట్ కూలిపోయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, బనకచర్ల గురించి మాత్రం మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ద్వా (PowerPoint Presentation)రా క‌ళేశ్వ‌రం ప్రాజెక్టు వాస్త‌వాలు, సాగు విస్తీర్ణం వంటి వాస్తవాలను వివరించారు.

“కేసీఆర్(KCR) నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) కలిసి తెలంగాణ (Telangana)ను అణచివేయాలని చూస్తున్నాయి. మేము చెప్పేవి నూటికి నూరు నిజం” అని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్నారని, కానీ బనకచర్లపై మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్‌కు రాజ‌కీయాల కంటే రాష్ట్ర‌మే ముఖ్య‌మని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్(KTR) మాట్లాడుతూ, హరీష్ రావు తక్కువ సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత సాధించారని, కానీ కాంగ్రెస్ పాలనలో కమీషన్లు, నిందలు, దందాలు నడుస్తున్నాయని ఆరోపించారు. “గుజరాత్, బీహార్‌లో బ్రిడ్జ్‌లు కూలినా చర్యలు లేవు. కానీ, మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే NDSA పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చింది. L&T సంస్థ కాంగ్రెస్ కార్యాలయం, మేడిగడ్డ బ్యారేజీ నిర్మించింది. బనకచర్ల విషయంలో అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు” అని కేటీఆర్ విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment