తీరు మార్చుకోవా..? సీఎంపై హరీశ్ రావు ఆగ్రహం

తీరు మార్చుకోవా..? సీఎంపై హరీశ్ రావు ఆగ్రహం

బీఆర్ఎస్ (BRS) సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరంగా పెండింగ్‌లో ఉన్న మినీ అంగన్వాడీ (Mini Anganwadi) కార్యకర్తల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటిదాకా అమలు చేయలేదన్నారు.

కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత మినీ అంగన్వాడీలను రెగ్యులర్ అంగన్వాడీలుగా గుర్తిస్తూ జీవో జారీ చేసినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. అయితే, ఆ జీవో కేవలం ప్రచార నిమిత్తమై జారీ చేసినదేనని విమర్శించారు. ఒక ఏడాది కావస్తున్నా ఆ జీవోను అమలు చేయకుండా, మహిళా కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ మాయ మాటలపై హెచ్చరిక
“మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రతి విషయంలోనూ మాయ మాటలు చెప్పి, వాస్తవంలో అమలు చేయకుండా మోసం చేస్తోంది. ముఖ్యంగా మినీ అంగన్వాడీల విషయంలో మహిళల జీవనాన్ని నష్టపరిచే విధంగా వ్యవహరిస్తోంది” అని హరీష్ రావు అన్నారు. పెంచిన జీతాలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని, మహిళల జీవనోపాధిని చిన్నచూపు చూడకూడదని బీఆర్ఎస్ నేత డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment