వేములవాడ (Vemulawada)లో కోడెల మరణం, ఎర్రగడ్డ (Erragadda) మానసిక ఆసుపత్రిలో (Mental Hospital) ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పరిపాలనలో విఫలమవుతోందని ఆయన ఆరోపించారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మంది రోగులు (70 Patients) ఫుడ్పాయిజన్ (Food Poisoning)తో అస్వస్థతకు గురైనా, తగిన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం బాధాకరమని ఆయన మండిపడ్డారు. వేములవాడలో కోడెల మరణాలు కొనసాగుతున్నా, ప్రభుత్వం మొద్ద నిద్రపోతోందని విమర్శించారు.
గడ్డి కొరతతో అనేక కోడెలు చనిపోతున్నా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు (T. Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. “మాకు బాధ్యత అప్పగిస్తే కోడెలను కాపాడతాం” అని ఆయన స్పష్టం చేశారు. కేసులు పెట్టడం, కమిషన్లు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం బిజీగా ఉందని, నిజమైన ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇతర విషయాల్లో మునిగిపోయిందని ఆరోపించారు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, రేపటి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు.