కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం

కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం

భారత ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్‌ (Gyanesh Kumar)ను 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC India)గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హర్యానా ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ (సీఎస్‌)గా విధులు నిర్వర్తిస్తున్న 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వివేక్ జోషిని కేంద్ర‌ ఎన్నికల కమిషనర్‌ (Election Commission)గా నియమించారు.

ప్రస్తుతం సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనుండటంతో, కొత్త సీఈసీ ఎంపిక కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ పాల్గొన్నారు. సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసి, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించగా, ఆమె ఆమోదం తెలిపారు.

జ్ఞానేశ్ కుమార్ ఎవరు?
1988 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జ్ఞానేశ్ కుమార్ 2023 మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019లో పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దు బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి కేంద్ర హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా (కశ్మీర్‌ డివిజన్‌)గా పని చేశారు. అనంతరం సహకార శాఖ కార్యదర్శిగా కొనసాగి, 2024 జనవరిలో పదవీ విరమణ చేశారు.

అయితే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా, ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. సీఈసీగా 2029 జనవరి 26 వరకు ఆయన కొనసాగుతారు. జ్ఞానేశ్ కుమార్ పర్యవేక్షణలోనే 2024 చివరిలో బిహార్, 2025లో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment