గుంటూరు జిల్లా (Guntur District) కలెక్టరేట్ (Collectorate) వద్ద జరిగిన ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. కన్నతల్లి (Mother Pain) బాధ చూడలేక 9 ఏళ్ల బుడతడు చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. పసి వయస్సులోనే తల్లి మానసిక క్షోభను అర్థం చేసుకొని పరిష్కారం చేసిన సాహసం పలువురికి ప్రేరణగా నిలిచింది. గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి (S. Nagalakshmi) నేతృత్వంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ సమావేశంలో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా, తొమ్మిదేళ్ల బాలుడు యశ్వంత్ (Yashwanth) తన స్కూల్ బ్యాగ్తో కలెక్టరేట్కు చేరుకుని, చిట్టి చేతుల్లో వినతి పత్రం పట్టుకుని తన కుటుంబ గోడును విన్నవించాడు. బాలుడి ఆవేదనను గమనించిన మీడియా ప్రతినిధులు అతన్ని కలెక్టర్ నాగలక్ష్మి వద్దకు తీసుకెళ్లారు.
యశ్వంత్ గుంటూరు నగరంలోని వెంకటరావుపేట (Venkataraopeta)కు చెందిన అలవాల రాధిక, రామ సుబ్బారెడ్డి దంపతుల కుమారుడు. నాలుగో తరగతి చదువుతున్న యశ్వంత్ పుట్టుకతోనే హృద్రోగంతో బాధపడుతున్నాడు. వైద్యుల సూచన మేరకు 16 ఏళ్లు నిండిన తర్వాత ఆపరేషన్ చేయాలని, అప్పటివరకు మందులు వాడాలని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యతో పాటు, కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. జీవనోపాధి కోసం రాధిక గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) ఎమర్జెన్సీ గేటు వద్ద టిఫిన్ బండి నడుపుతోంది. అయితే, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ బండిని తొలగించడంతో కుటుంబానికి ఉపాధి దూరమైంది. ఈ పరిస్థితి రాధికను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. “మనం ఇద్దరం చనిపోదాం” అని తల్లి బాధతో యశ్వంత్తో అనడంతో, ఆ బాలుడు తన కుటుంబాన్ని ఆదుకునేందుకు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించాడు.
కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి యశ్వంత్ ఆవేదనను గుర్తించి, వెంటనే చొరవ చూపారు. ఆమె ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించి, GGH ఎదుట టిఫిన్ బండి నడిపేందుకు రాధికకు స్థలాన్ని కేటాయించారు. ఈ చర్య యశ్వంత్ కుటుంబానికి జీవనోపాధి తిరిగి అందించడమే కాక, కలెక్టర్ నాగలక్ష్మి సానుభూతి, చురుకైన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్ నాయకత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగం సమర్థతను తెలియజేస్తోంది. యశ్వంత్ ధైర్యం, కలెక్టర్ స్పందన స్థానికుల్లో చర్చనీయాంశమైంది.
ఇది మంచి ప్రభుత్వం కాదు.. మధ్యతరగతి ప్రజలు ఏడిపించే ప్రభుత్వం
— YSR Congress Party (@YSRCParty) July 1, 2025
కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకోనివ్వకుండా.. దాన్ని కాలువలో పడేశారంటూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంకు కన్నీళ్లతో వచ్చిన 8 ఏళ్ల యశ్వంత్
వైయస్ జగన్ గారి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి పెట్టుకునే… pic.twitter.com/LPHs8VLcEA