ఐ-టీడీపీ (I-TDP) బహిష్కృత కార్యకర్త కిరణ్ చేబ్రోలు (Kiran Chebrolu) ను అరెస్టు చేసిన తీసుకెళ్తున్న పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారనే కారణంతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) ను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. ఈ కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. గుంటూరులో అరెస్టు వివరాలను ఎస్పీ సతీష్కుమార్ (SP Satish Kumar) వెల్లడించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం నేరపూరిత చర్య అని, మాధవ్తో పాటు మరో ఐదుగురు దాడిలో పాల్గొన్నారని, దీంతో వారిని అరెస్టు చేసినట్లుగా ఎస్పీ వివరించారు.
కాగా, ఐదుగురు నిందితులతో పాటు మాజీ ఎంపీ మాధవ్ను కూడా ముసుగు (Mask) ధరించాలని పోలీసులు చెప్పడంతో గోరంట్ల మాధవ్ నో(NO) చెప్పారు. నేను ఏమైనా దోపిడీ దొంగనా.. నేను మాజీ ఎంపీని, మాజీ పోలీస్ ఆఫీసర్ను ముసుగు నేను ఎందుకు ధరించాలని పోలీసులతో (Police) వాగ్వాదానికి (Argument) దిగారు.
వారు ధరించారా..?
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత వైసీపీ హయాంలో ఈఎస్ఐ (ESI) కుంభకోణంలో (Scam) అరెస్టు అయిన అచ్చెన్నాయుడు (Achennaidu), పలు కేసుల్లో అరెస్టు అయిన టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర (Kollu Ravindra), పట్టాభీ (Pattabhi) వంటి వారి అరెస్టులను పోలీసులు చూపినప్పుడు ముసుగు (Mask) ధరించారా..? అని ఆ సంఘటనలన్నింటినీ గుర్తుచేసుకుంటూ మాజీ ఎంపీకి ముసుగు వేసే ప్రయత్నం ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో పోలీసులు అత్యుత్సాహం (Overenthusiasm) ప్రదర్శిస్తున్నారని నెటిజన్లు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.