తమిళనాడు ప్రభుత్వం (Government of Tamil Nadu) జర్నలిస్టులకు ఒక గొప్ప శుభవార్త ప్రకటించింది. జర్నలిస్టుల కుటుంబ సహాయ నిధి (Journalist’s Relief Fund) పెంచాలని డీఎంకే ప్రభుత్వం (DMK Government) తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం 20 ఏళ్ల సర్వీసు అనంతరం ప్రమాదవశాత్తు మరణిస్తే రూపాయలు 10 లక్షలు, 15 ఏళ్ల సర్వీసు తర్వాత మరణిస్తే రూ.7.5 లక్షలు, 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన తరువాత ఎవరైనా జర్నలిస్టు సహజ మరణం పొందితే రూ.2.5 లక్షల సాయం ఆ కుటుంబాలకు అందించనున్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జర్నలిస్టుల కుటుంబాలకు సాయం అందించడం కోసం ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మంచి నిర్ణయం తీసుకుందని పలు జర్నలిస్టు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.