జర్నలిస్టులకు స్టాలిన్ ప్ర‌భుత్వం శుభవార్త

జర్నలిస్టులకు స్టాలిన్ ప్ర‌భుత్వం శుభవార్త

తమిళనాడు ప్రభుత్వం (Government of Tamil Nadu) జర్నలిస్టులకు ఒక గొప్ప శుభవార్త ప్రకటించింది. జర్నలిస్టుల కుటుంబ సహాయ నిధి (Journalist’s Relief Fund) పెంచాలని డీఎంకే ప్రభుత్వం (DMK Government) తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం 20 ఏళ్ల సర్వీసు అనంతరం ప్ర‌మాద‌వ‌శాత్తు మరణిస్తే రూపాయలు 10 లక్షలు, 15 ఏళ్ల సర్వీసు తర్వాత మరణిస్తే రూ.7.5 లక్షలు, 5 ఏళ్ల సర్వీసు పూర్త‌యిన త‌రువాత ఎవ‌రైనా జ‌ర్న‌లిస్టు సహజ మరణం పొందితే రూ.2.5 లక్షల సాయం ఆ కుటుంబాల‌కు అందించ‌నున్నారు.

ముఖ్యమంత్రి స‌హాయ నిధి నుంచి జర్నలిస్టుల కుటుంబాలకు సాయం అందించడం కోసం ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్ర‌భుత్వం జర్నలిస్టుల కుటుంబాల‌కు అండ‌గా మంచి నిర్ణ‌యం తీసుకుంద‌ని ప‌లు జ‌ర్న‌లిస్టు సంఘాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment