తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha) అండర్-19 ఉమెన్స్ వరల్డ్కప్ (U19 Women’s World Cup)లో తన అసాధారణ ప్రదర్శనతో భారత జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. 19 ఏళ్ల త్రిష టోర్నమెంట్ మొత్తం 7 మ్యాచుల్లో 309 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆమె యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండడం విశేషం. ఈ వరల్డ్కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ త్రిషే.
కేవలం బ్యాటింగ్తోనే కాకుండా, బౌలింగ్లోనూ త్రిష తన ప్రతిభను చూపి 7 వికెట్లు తీసింది. ఓపెనర్గా ఆడిన త్రిష 4, 27, 49, 40, 110, 44 పరుగులతో భారత విజయానికి మార్గదర్శిగా నిలిచింది. భద్రాచలం చెందిన ఈ క్రికెట్ స్టార్ భవిష్యత్తులో భారత మహిళా జట్టుకు ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకరిగా ఎదుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.