299 మంది రోగులపై డాక్టర్ అత్యాచారం

299 మంది రోగులపై డాక్టర్ అత్యాచారం

పవిత్రమైన వైద్య వృత్తిలో కొన‌సాగుతూ ఆ వృత్తికే కళంకం తెచ్చే దారుణ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడో వైద్యుడు. చిన్న పిల్ల‌లు అనే స్పృహ కోల్పోయి వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డ్డాడు. ఫ్రాన్స్‌లో జోయెల్ లీ స్కౌర్నెక్ అనే సర్జన్ వికృత చేష్ట‌లు ప‌డ‌ప‌డ్డాయి. 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండ‌టం విచారకరం. ఈ దార‌ణ ఘ‌ట‌న‌ల‌పై న‌మోదైన కేసులో 74 ఏళ్ల జోయెల్ లీ స్కౌర్నెక్‌పై విచార‌ణ కొన‌సాగుతోంది.

జోయెల్ లీ స్కౌర్నెక్ 1989 నుంచి 2014 మధ్య 299 మందిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. జోయెల్ అసలు రూపం 2017లో బయటపడింది. తన పొరుగింట్లోని ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ద్వారా కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అతని ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా 3 లక్షలకు పైగా ఫొటోలు, 650కి పైగా అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. జోయెల్ డైరీ పోలీసులను షాక్‌కు గురిచేసింది. ఎవరిపై ఎలా లైంగిక దాడి చేశాడో వివరంగా రాసుకున్నాడు.

2020లో శిక్ష, నిజాలు బయటకు రాకుండా..
2020లో కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించినా, తాజాగా దర్యాప్తులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై లైంగిక దాడి చేసినట్లు జోయెల్ నేరాన్ని ఒప్పుకున్నాడు. బాధితుల్లో చాలా మందికి తమపై జరిగిన దాడి గురించి తెలియకపోవడం బాధాకరం. డైరీలో పేర్లు చూసే నిజాన్ని తెలుసుకున్న బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment