విజయవాడ సబ్ జైల్లో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వంశీకి ప్రాణహాని ఉందని, జైల్లో వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన భార్య పంకజశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజశ్రీ మూలాకత్లో కలిశారు. వంశీ వెన్ను నొప్పి, శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారన్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలో జైల్లో మెంటల్గా టార్చర్ చేస్తున్నారని, మానసికంగా కుంగదీస్తున్నారన్నారు.
వంశీ ఉన్న బారక్లో 60 సీసీ కెమెరాలు పెట్టారని, ఆయన ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ భార్య పంకజశ్రీ మండిపడ్డారు. ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తామని చెప్పారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి తన కుటుంబానికి ధైర్యం చెప్పారని, వచ్చేవారం వంశీని కలుస్తానని జగన్ చెప్పారని ఆమె గుర్తుచేశారు. వంశీ అక్రమ అరెస్టుపై పార్టీ పరంగా తమకు పూర్తి అండ లభించిందని, లీగల్ టీమ్ ని కూడా ఏర్పాటు చేశారన్నారు.
వంశీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని పంకజశ్రీ ధ్వజమెత్తారు. తన భర్తకి టైల్ బోన్ ఫ్రాక్చర్ అయిందని, ఆరోగ్యం బాగోలేదన్నారు. నేరం రుజువు కాకుండానే బంధించారని, జైల్లో ఒక సెల్ లో బంధించి ఎవరిని కలవానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఫిజికల్గా, మెంటల్గా టార్చర్ చేస్తున్నారన్నారు. సత్యవర్ధన్ని అదుపులో తీసుకున్న పోలీసులు.. మేజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు.