సంతానోత్పత్తి రేటు తగ్గుతూ ప్రపంచ దేశాలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, ఉగాండాకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ అంకెను సంఖ్యగా మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తూర్పు ఉగాండాలోని ముకిజా గ్రామానికి చెందిన ముసా హసహ్య కసెరా, తన 12 మంది భార్యలతో కలిసి 102 మంది పిల్లలకు తండ్రిగా నిలిచారు.
ఆశ్చర్యకర కుటుంబం: 578 మంది సంతానం
ముసా హసహ్య కసెరా కుటుంబంలో ప్రస్తుతం చిన్నారుల సంఖ్య 578. ఇది ఎలా అని ఆశ్చర్యపోతున్నారా..? అతను తన సంతానానికి పెళ్లి చేయడంతో కుటుంబం మరింత పెద్దదిగా విస్తరించింది. 578 మంది మనవలు, మనవరాళ్లను కలిగి ఉన్న ఈ కుటుంబం, వారి పేర్లు గుర్తుంచుకునేందుకు ప్రత్యేక రిజిస్టర్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఒక వ్యక్తి ఈ కుటుంబాన్ని కలుసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీని ద్వారా ఈ ప్రత్యేక కుటుంబం ప్రపంచానికి మరింత దగ్గరైంది.
ముసా హసహ్యా కసేరా వయసు ప్రస్తుతం 70 సంవత్సరాలు. ఒక్కో భార్య నుంచి 8, 9 మంది పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు తన సంతానాన్ని పెంచేందుకు, వారి కడుపు నింపేందుకు నానా పాట్లు పడుతున్నాడు. 1972లో ముసా తొలి వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయసు 17 సంవత్సరాలు. ఒకరి తర్వాత ఒకరిగా మొత్తం 12 మందిని చేసుకున్నాడు. ‘దిఇండోట్రెక్కర్’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు సాధించింది.