35 బంతుల్లో శతకం..! పంజాబ్ బ్యాటర్ సెన్సేషన్

35 బంతుల్లో శతకం..! పంజాబ్ బ్యాటర్ సెన్సేషన్

విజయ్ హజారే ట్రోఫీ మొదటి రోజే పంజాబ్ ఆటగాడు అన్మోల్‌ప్రీత్ సింగ్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే ఘనత సాధించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అన్మోల్‌ప్రీత్ 35 బంతుల్లోనే శతకం బాదాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెట‌ర్‌గా చరిత్ర సృష్టించాడు.

అంతకుముందు ఈ ఘ‌న‌త భారత విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ యూసుఫ్‌ పఠాన్ పేరిట ఉండేది. అతను బరోడా తరఫున మహారాష్ట్రపై 2010లో 40 బంతుల్లో శతకం సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే లిస్ట్ ఏ క్రికెట్‌లో అన్మోల్‌ప్రీత్‌ మూడో స్థానంలో నిలిచాడు. జేక్ ఫ్రేజర్ (29 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో) అతని కంటే ముందున్నారు.

అన్మోల్‌ప్రీత్ సింగ్‌ అజేయ ఇన్నింగ్స్‌లో 45 బంతుల్లో 115 పరుగులు (12 ఫోర్లు, 9 సిక్సులు) చేశాడు. ఈ విధ్వంసకర ఆటతీరు మ్యాచ్‌లో విజయం సాధించడమే కాదు, క్రికెట్ చరిత్రలో అతనికి ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment