బిగ్ అప్డేట్‌: నకిలీ మద్యం కేసులో సిండికేట్ లింకులు

బిగ్ అప్డేట్‌: నకిలీ మద్యం కేసులో సిండికేట్ లింకులు

క‌ల్తీ మ‌ద్యం కేసు దర్యాప్తులో ఎక్సైజ్ శాఖకు కీలకమైన ఆధారాలు ల‌భిస్తున్నాయి. న‌కిలీ లిక్క‌ర్ కేసు (Fake Liquor Case)లో ఏ1 అద్దేపల్లి జనార్ధన్‌ (Addepalli Janardhan)తో కలిసి లిక్కర్ వ్యాపారాలు నిర్వహించిన సిండికేట్ సభ్యులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సిండికేట్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నట్లు, పలు జిల్లాల్లో వీరి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

జనార్ధన్ స్నేహితుడు మరియు వ్యాపార భాగస్వామి బొర్రా కిరణ్‌ (Borra Kiran)కు చెందిన బార్‌లో కూడా నకిలీ మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌  (Hyderabad) లోని E7 బార్ మరియు తాడేపల్లి పాతూరి రోడ్డులోని మరో బార్‌లో వీరు కలిసి నకిలీ మద్యం సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.

నకిలీ మద్యం తయారీకి అవసరమైన ఖాళీ బాటిల్స్‌ను సరఫరా చేసిన వ్యక్తిగా శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) బంధువుల బార్ కూడా రాడార్‌లోకి వచ్చింది. ఈ బార్‌ల ద్వారా పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం జరిగిందని అనుమానిస్తున్న అధికారులు, సంబంధిత ఆర్థిక లావాదేవీలను సవివరంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సిండికేట్‌ (Syndicate)పై మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment