విశాఖ‌లో నకిలీ ఏసీబీ అధికారి.. కేసులో భారీ ట్విస్టులు

విశాఖ‌లో నకిలీ ఏసీబీ అధికారి.. కేసు భారీ ట్విస్టులు

విశాఖపట్నంలోని మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ (Sub-Registrar) కార్యాలయంలో బుధవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam) టీడీపీ (TDP) పార్ల‌మెంట‌రీ పార్టీ బీసీ సెల్ (Parliamentary BC Cell) అధికార ప్ర‌తినిధిగా చ‌లామ‌ణి అవుతున్న సుధాకర్ (Sudhakar) అనే వ్యక్తి తనను తాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారినని చెప్పుకుంటూ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

బుధ‌వారం ఉదయం 11 గంటల సమయంలో, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణ ప్రజలు తమ పని కోసం ఎదురు చూస్తుండగా, సిబ్బంది వారివారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో సుధాకర్ అనే వ్యక్తి నేరుగా సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి, తనను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో మీ ఆఫీస్‌లో రైడ్ (Raid) జరగనుందని చెబుతూ, ఆ రైడ్ జరగకుండా ఆప‌డానికి రూ.5 లక్షలు ఇవ్వాలని టీడీపీ నేత (TDP Leader) సుధాక‌ర్‌ (Sudhakar) డిమాండ్ చేశాడు. అయితే అతని ప్రవర్తన, వేషధారణపై అధికారులు అనుమానం రావ‌డంతో సబ్‌రిజిస్ట్రార్ చక్రపాణి (Chakrapani) వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది అతన్ని మాటల్లో పెట్టి ఆలస్యం చేయగా, పీఎం పాలెం పోలీసులు ఆఫీస్‌కు చేరుకుని సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సుధాకర్ అసలైన ఏసీబీ అధికారి కాదని, నకిలీ (Fake) అని వెల్లడైంది. ప్రస్తుతం ఆయనను పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించి, మరింత విచారణ చేపట్టారు.

టీడీపీ బీసీ సెల్ అధికార ప్ర‌తినిధి..
కాగా, సుధాక‌ర్ అనే వ్య‌క్తి తెలుగుదేశం పార్టీ క్రియాశీల‌క నాయ‌కుడు అని, విశాఖ‌ప‌ట్నం టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ బీసీ సెల్ అధికార ప్ర‌తినిధి అని ఇటీవ‌ల కూట‌మి ప్ర‌భుత్వం గెలిచిన త‌రువాత అత‌డు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, సీఎం చంద్ర‌బాబు (Chandrababu) తో దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

సుధాక‌ర్‌కు స‌హ‌క‌రించిన స్వ‌ర్ణ‌ల‌త‌
ఇదిలా ఉండ‌గా.. నకిలీ ఏసీబీ అధికారి అని చెప్పుకుంటున్న టీడీపీ నేత‌ సుధాకర్ వెనుక గతంలో ఇలాంటి నేరాలకే పాల్పడి సస్పెండ్ అయిన రిజర్వ్ పోలీస్ ఇనిస్పెక్ట‌ర్ స్వర్ణలత (Swarnalatha) ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ ఇనిస్పెక్టర్ సుధాకర్ ఫోన్‌లో ఏసీబీ ఎస్పీగా పరిచయం చేసుకుని రిజిస్ట్రార్ చక్రపాణిని స్వర్ణలత బెదిరించినట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. చక్రపాణితో మాట్లాడిన ఫోన్ నంబర్ AR ఇనిస్పెక్టర్ స్వర్ణలతదిగా గుర్తించామన్న పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇనిస్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలతను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో విశాఖలో 2 వేల రూపాయల నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించిన కేసులో స్వ‌ర్ణ‌ల‌త అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లింది. సినిమాలలో నటించాలన్న ఆకాంక్షతో ఫిల్మ్, డాన్స్ ఇనిస్టిట్యూట్‌లో స్వ‌ర్ణ‌ల‌త ట్రైనింగ్ తీసుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment