ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై (Sakshi Offices) గత మూడు రోజులుగా జరుగుతున్న దాడులు.. ఏలూరు జిల్లాలో (Eluru District) హింసాత్మక ఘటనకు దారితీశాయి. సాక్షి టీవీ డిబేట్ (Sakshi TV Debate)లో ప్యానల్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు అమరావతి (Amaravati)లో మహిళలు ఆందోళన వ్యక్తం చేపట్టగా, మరుసటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన టీడీపీ శ్రేణులు (TDP Cadres) సాక్షి కార్యాలయాలపై వరుసగా దాడులకు (Attacks) పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ (TDP Party)పథకం ప్రకారం చేపడుతోందని వైసీపీ (YSRCP) విమర్శలు చేస్తున్నప్పటికీ.. సాక్షిపై దాడులు ఆగడం లేదు.
తాజాగా మంగళవారం ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్లు (Petrol Bottles), రాళ్లతో (Stones) కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సాక్షి కార్యాలయం నుంచి మంటలు ఎగసిపడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెట్రోల్ దాడిలో ఆఫీస్లోని సోఫాలు (Sofas), ఫర్నిచర్ (Furniture) అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో కార్యాలయ యజమానికి చెందిన కారు (Car) కూడా పాక్షికంగా ధ్వంసమైంది. దెందులూరు (Denduluru) కు చెందిన టీడీపీ నిరసన కారులు ఈ దాడికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.
మూడు రోజులుగా భయానకం
గత మూడు రోజులుగా సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడుల సమయంలో పోలీసులు నిశ్చేష్టంగా ఉండటం, దాడులను అరికట్టడంలో విఫలమయ్యారంటూ ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంలో నుంచి ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల నివాసితులను భయాందోళనలకు గురిచేశాయి.
బొత్స సత్యనారాయణ ఖండన
సాక్షి కార్యాలయాలపై దాడి ఘటనలను వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (Law And Order)పూర్తిగా దెబ్బతిందన్నారు. మూడు రోజులుగా సాక్షి కార్యాలయాలపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పుపెట్టడం దుర్మార్గమన్నారు. మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడేనని అభిప్రాయపడ్డారు. హింసాత్మక చర్యలు భవిష్యత్లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయని హెచ్చరించారు. దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరని, ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని టీడీపీని ఉద్దేశించి మండిపడ్డారు. జరిగిన దారుణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
కొమ్మినేని అరెస్టుపై ఖండన
సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులతో పాటు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) అరెస్టును కూడా బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ దాడులు మీడియా స్వేచ్ఛను అణచివేసే కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. టీడీపీ పథకం ప్రకారం సాక్షి ఆఫీస్లపై దాడులకు తెగబడుతోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
🚨 Breaking News 🚨
— Telugu Feed (@Telugufeedsite) June 10, 2025
ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడి.. ఎగసిపడుతున్న మంటలు
పెట్రోల్ బాటిళ్ళు, రాళ్ళ తో దాడి చేసిన దెందులూరుకు చెందిన వ్యక్తులు
అగ్నికి ఆహుతైన కార్యాలయం వద్ద ఉన్న సోఫా సెట్లు, ఫర్నిచర్
రెండ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై కొనసాగుతున్న… pic.twitter.com/SGIpUE8yES