మస్క్ సంచలన నిర్ణయం.. ‘ఎక్స్’ విక్రయం

మస్క్ సంచలన నిర్ణయం.. ‘ఎక్స్’ విక్రయం

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన యాజమాన్యంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్)ను తన స్వంత xAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి 33 బిలియన్ డాలర్లకు ఆల్-స్టాక్ డీల్ (All-Stock Deal) రూపంలో విక్రయించినట్లు ప్రకటించారు.

ఎందుకు ఈ విక్రయం?
xAI విలువను 80 బిలియన్ డాలర్లుగా మస్క్ అంచనా వేశారు. ‘ఎక్స్’లో అధునాతన ఏఐ (AI) ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా మరింత వినూత్నమైన అనుభూతిని అందించవచ్చని మస్క్ తెలిపారు. ఈ విలీనంతో సమాచారం మ‌రియు కృత్రిమ మేధస్సును అనుసంధానం చేసి మరింత మెరుగైన ఫలితాలు అందించగలమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

మస్క్ స్ట్రాటజీ & భవిష్యత్ ప్రణాళిక
2022లో మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసి, సంస్థలో భారీ మార్పులు చేశారు. ఉద్యోగులను తొలగించి, “X” పేరుతో రీబ్రాండ్* చేశారు. 2023లో xAIను ప్రారంభించి, AIతో అనుసంధానించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) సలహాదారుడిగా వ్యవహరిస్తూ, టెస్లా (Tesla), స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీలకు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఈ డీల్ ద్వారా మస్క్ ఎక్స్ మ‌రియు xAIని కలిపి భవిష్యత్తులో మరింత శక్తివంతమైన AI & సోషల్ మీడియా అనుసంధానాన్ని సృష్టించాలని భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని ప్రభావితం చేసే నిర్ణయంగా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment