టెస్లా, ఎక్స్ అధినేత, వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రతిష్టాత్మక పురస్కారం అందుకునేందుకు అడుగు దూరంలో ఉన్నారు. మస్క్ పేరు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)కి నామినేట్ అయ్యిందని యూరోపియన్ పార్లమెంటేరియన్ బ్రాంకో గ్రిమ్స్ (Branko Grims) తెలిపారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ ముందుకు మస్క్ పేరు వెళ్లిందని ఆయన వెల్లడించారు.
బ్రాంకో గ్రిమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మస్క్ తన ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్ఫాం ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛ (Freedom of Speech,), మానవ హక్కులను పరిరక్షించేందుకు విశేషంగా కృషిచేశారని పేర్కొన్నారు. కాగా, మస్క్ నామినేషన్ చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న మస్క్, ప్రస్తుతం డోజ్ శాఖలో ఉన్నట్లు సమాచారం. నోబెల్ బహుమతిపై చివరి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.