టీవీకే పార్టీ 20% ఓటు బ్యాంకు ఉందా? – పీకే వ్యూహం ఏంటి?

టీవీకే పార్టీ 20% ఓటు బ్యాంకు ఉందా? - పీకే వ్యూహం ఏంటి?

త‌మిళ స్టార్ హీరో ద‌ళప‌తి విజ‌య్(Hero Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) త‌మిళ రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కొత్తగా 28 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు విజయ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన టీవీకే, 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని విజయ్ నిర్ణయించారు. అందులో భాగంగా, ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ లేనివిధంగా, హిజ్రాలకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

ఈ కొత్త విభాగాల్లో మీడియా వింగ్, ఐటీ, న్యాయవాదులు, ప్రచారం, సభ్యత్వ నమోదు, శిక్షణ, కార్యకర్తల నైపుణ్య అభివృద్ధి, పర్యావరణం, చరిత్ర, పరిశోధన, హిజ్రాల విభాగం, దివ్యాంగుల విభాగం, యువజన, మహిళలు, వ్యాపారులు, రైతులు, కార్మికులు, ప్రవాస భారతీయులు, వైద్య విభాగం, ప్రభుత్వ ఉద్యోగులు, సంస్కృతి & సంప్రదాయ విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల వివరాలను త్వరలో భారత ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు.

నిజంగా 20% ఓటు బ్యాంకు ఉందా?
టీవీకేకు తమిళనాడులో 20% ఓటు బ్యాంకు ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ఒక నివేదిక ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఏడాది కూడా పూర్తి కాలేని పార్టీకి అంత భారీ ఓటు బ్యాంకు ఉండడం సాధ్యమేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ పేరును ఉపయోగించి టీవీకే ప్రచారం చేసుకుంటోందని విమర్శలు వస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment