ఆసీస్ బ్యాటర్ లబుషేన్ను అవుట్ చేసిన అనంతరం భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ తన ప్రత్యేక హావభావాలతో మైదానాన్ని హోరెత్తించాడు. మెల్బోర్న్ మైదానంలో జరిగిన ఈ ఘట్టం భారత క్రికెట్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. “చూడండి! అందరూ నన్నే చూడండి!” అనేలా సిరాజ్ సెలబ్రేషన్స్ తీరును చూసి అభిమానులు మురిసిపోయారు.
సిరాజ్ ఎక్స్ప్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా, అభిమానులు “దటీజ్ DSP సిరాజ్!” అంటూ కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపించారు. సిరాజ్ చూపిన ఆత్మవిశ్వాసం, మైదానంలో ప్రదర్శించిన ఉద్రేకం ప్రతి భారత క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చురుకైన ప్రదర్శనతో సిరాజ్ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, అభిమాన హృదయాల్లో ఒక స్టార్గా నిలిచిపోయాడు.
ఈ మ్యాచ్లో భారత్ను తొలుత లబూషేన్ (70), కమిన్స్ (41) ఇబ్బందిపెట్టారు. వీరిద్దరు ఏడో వికెట్కు 57 పరుగులు జోడించారు. ప్రస్తుతం క్రీజ్లో ఆసీస్ చివరి వరుస ఆటగాళ్లు నాథన్ లయోన్ (41 నాటౌట్), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్) ఉన్నారు. 228 పరుగులు చేసిన ఆసిస్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆధిక్యం 333 పరుగులకు చేరింది.