మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ (Mohanlal) తన అభిమానులకు శుభవార్త చెప్పారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘దృశ్యం-3’ (Drishyam 3)త్వరలో ప్రారంభం కానుందని ఆయన అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా, దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోనితో కలిసి దిగిన ఫొటోను మోహన్ లాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఫొటో కింద “గతం ఎప్పుడూ నిశబ్దంగా ఉండదు.. ‘దృశ్యం-3’ పక్కా..” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే, చిత్ర తారాగణం, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు.
2013లో విడుదలైన మలయాళ ‘దృశ్యం’ భారీ విజయం సాధించి, పలు భాషల్లో రీమేక్ అయ్యింది. మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘దృశ్యం-2’ కూడా ప్రేక్షకులను మళ్లీ ఆ సినిమాటిక్ మిస్టరీలోకి తీసుకెళ్లింది. ఇప్పుడు ‘దృశ్యం-3’పై అంచనాలు మరింత పెరిగాయి.
The Past Never Stays Silent
— Mohanlal (@Mohanlal) February 20, 2025
Drishyam 3 Confirmed!#Drishyam3 pic.twitter.com/xZ8R7N82un