టీమిండియా క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా యువ క్రికెటర్ రిషబ్ పంత్ తో కలిసి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీరి ఎనర్జీ, స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుక ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఘనంగా జరిగింది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా సభ్యుడిగా ఉన్న పంత్, దుబాయ్ నుంచి నేరుగా వేడుకకు చేరుకున్నాడు. అతని ఆహ్వానం మేరకు ధోనీ, రైనా కూడా వేడుకలో పాల్గొన్నారు.
ఇద్దరూ కలిసి తమ సన్నిహితులతో డాన్స్ ఫ్లోర్ను షేక్ చేయగా, “తలా” ధోనీ, “చిన్నతలా” రైనా స్టెప్పులు అదిరిపోయాయి అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Rishabh Pant , MS Dhoni & Suresh Raina dancing together 🕺🕺😂😂 pic.twitter.com/b03FSVUvGv
— Riseup Pant (@riseup_pant17) March 11, 2025